కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్సార్ దగ్గరకు అబద్దం: సిఎం వ్యాఖ్యలపై వినోద్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Vinod kumar
కరీంనగర్: గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి దగ్గరకు తీసుకు వెళ్లానన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలలో నిజం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు వినోద్ కుమార్ బుధవారం కరీంనగర్‌లో అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మాటల్లో నిజాయితీ లేదన్నారు. పార్టీలు చీలాలని తాము కోరుకోవడం లేదని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో తెలంగాణకు అనుకూలంగా ప్రకటన ఇప్పిస్తే చాలన్నారు.

తెలంగాణకు అనుకూలంగా అన్ని పార్టీల నేతలు వారి అధినేతలను ఒప్పిస్తే చాలన్నారు. ఉద్యమంలోని వారిని చీల్చినంత మాత్రాన ఉద్యమం ఆగదన్నారు. త్వరలో తెలంగాణ తీర్మానం అసెంబ్లీలో పెట్టడం ఖాయమన్నారు. సీమాంధ్ర నేతలు ఎన్ని పదవులు అయినా తీసుకోండి. కానీ తెలంగాణకు అడ్డుపడకండని కోరారు. తెలంగాణకు అనుకూల ప్రకటన వచ్చే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు. సీమాంధ్ర ఉద్యమం కృత్రిమ ఉద్యమమన్నారు. అయితే కొందరు బడా వ్యాపార రాజకీయ నాయకులు దాన్ని ప్రజా ఉద్యమంగా చూపించాలని తాపత్రయపడుతున్నారని ఆరోపించారు. అవినీతి సొమ్ముతో ఉద్యమాలను అణచలేరన్నారు.

English summary
TRS former MP Vinod Kumar blamed Telangana Telugudesam Party today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X