వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్‌కు బిగుస్తున్న ఈడి ఉచ్చు?

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jaganmoahn Reddy
హైదరాబాద్: వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడి) ఉచ్చు బిగుస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పటికే జగన్, ఎమ్మార్‌లపై విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం, అక్రమ నిధుల చలామణి నిరోధక చట్టం కింద వేర్వేరు కేసులు నమోదు చేసిన ఈడి బుధవారం దిల్ కుష్ అథితి గృహంలో సిబిఐ అధికారులను కలిశారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో ఏయే అంశాలు ఉన్నాయో పరిశీలించి ఆ తర్వాత తదుపరి ప్రణాళిక రూపొందించేందుకు ఈడి అధికారి సిబిఐ అధికారులను కలిసినట్లుగా తెలుస్తోంది.

ఈడి అధికారులు జగన్ కంపెనీలలోకి ఎక్కడి నుండి నిధులు మళ్లాయి? అవి ఎలా వచ్చాయి? పెట్టుబడులు పెట్టిన కంపెనీల వార్షిక ఆదాయం ఎలా ఉంది? అనే విషయాలను పరిశీలించి అనంతరం ప్రణాళిక సిద్ధం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఆర్‌ను పరిశీలించిన అనంతరం ఎవరెవరికి నోటీసులు పంపాలనే నిర్ధారణకు వస్తుంది. అనంతరం గురువారం లేదా శుక్రవారం నుండి ఈడి నోటీసులు పంపే అవకాశం ఉంది.

కాగా ఇప్పటికే జగన్ ఆస్తుల కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‌లో జగన్ పేరు మొదట ఉన్న విషయం తెలిసిందే. జగన్ తో సహా మరో 73 కంపెనీలు, వ్యక్తుల పేర్లు ఉన్నాయి. ఇక ఎమ్మార్ కేసులో బిపి ఆచార్య పేరు మొదట ఉంది. ఆయనతో సహా మరో ఆరుగురి పేర్లు ఇందులో ఉన్నాయి.

English summary
YSRC party president YS Jaganmohan Reddy in trouble with enforcement directorate. ED may sent notices to Emmar and Jagan case accuses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X