రామోజీ కోట రహస్యం, జగన్ సాక్షి డైలీ ధ్వజం

ఈనాడు గ్రూపులో 40 శాతం వాటా బయటివారిదేనని, ా బయటివారు ఈక్వేటర్ ట్రేడింగ్, అనూ ట్రేడింగులేనని, ముందుండి నడిపించింది నిమేష్ కంపానీ, వినయ్ ఛజ్లానీ కాగా, వెనక నుండి నడిపించింది అంబానీ - చంద్రబాబులేనని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో వ్యాఖ్యానించింది. నెల రోజుల్లో పదుల కొద్దీ డొల్ల కంపెనీలు పుట్టుకొచ్చాయని, కోటి మూలధనం కూడా లేని కంపెనీల నుంచి వేల కోట్ల ప్రవాహం జరిగిందని, అంతటి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో కంపెనీలు చెప్పడం లేదని వివరించింది.
మార్గదర్శి కుంభకోణంలో రామోజీ రావు పీకల్లోతు కూరుకుపోయి తననెవరు బయటపడేస్తారా అని దిక్కులు చూస్తున్న సమయంలో దేశీయ దిగ్గజం రియలన్స్ ముందుకు వచ్చిందని, అది ముందుకు రావడం వెనక రహస్యమేమిటని సాక్షి పత్రిక వార్తాకథనంలో అన్నది. ఈనాడు గ్రూపులోకి పెట్టుబడులు ఎలా చేరాయనే విషయంపై సాక్షి దిన పత్రిక తన వార్తాకథంలో వివరించింది.












Click it and Unblock the Notifications