తీవ్రవాదులకు ఢిల్లీ టార్గెట్గా మారింది: చిదంబరం

ఇది హృదయ విదారక సంఘటన అని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎల్కె అద్వానీ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్రవాదులు ఢిల్లీకి గురి పెట్టారన్నారు. దేశ రాజధానిలో వరుసగా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. పేలుడుపై విచారణ త్వరితగతిన జరపాలన్నారు. పార్లమెంటుకు అతిసమీపంలో అదీ హైకోర్టు వద్ద పేలుడు జరగడం బాధాకరమన్నారు. పదేళ్ల క్రితం సెప్టెంబర్ 11న పేలుళ్లు జరిగాయని ఆ ఘటనకు దీనికి సంబంధం ఉండి ఉండవచ్చునని అద్వానీ అనుమానాలు వ్యక్తం చేశారు. తీవ్రవాద ఘటనలను ఆషామాషీగా తీసుకోరాదని ములాయం సింగ్ అన్నారు.












Click it and Unblock the Notifications