దారి తప్పిన ట్రెయిన్: పూరీ కాకుండా వరంగల్ చేరింది
వరంగల్ చేరిన తర్వాత అక్కడి అధికారులు దానిని గుర్తించి సికింద్రాబాద్కు సమాచారం అందించారు. దారి తప్పి వచ్చిన రైలును వరంగల్ అధికారులు తిప్పి పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. దారి తప్పిన రైలులో వచ్చిన పర్యాటకులు మాత్రం రైల్వే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మీడియా రైల్వే అధికారులను ప్రశ్నించగా మాట్లాడటం లేదని సమాచారం. సదరు ప్రత్యేక రైలు పూరీ మాత్రమే కాకుండా వరంగల్ మీదుగా మరో చోటకు వెళ్లాల్సి ఉందని మొదట ఇటు వైపు ప్రయాణంగా భావించి వరంగల్ వచ్చిందని కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Comments
English summary
Tirupati special train missed it's route today and it reached to Warangal.
Story first published: Wednesday, September 7, 2011, 15:21 [IST]