వైయస్ జపం పొలిటికల్ మార్కెటింగ్: జగన్పై పొన్నం

గతంలో మేం పార్లమెంటుకు హాజరైన సమావేశాలకు ఇప్పటి సమావేశాలకు తేడా స్పష్టంగా కనపిస్తోందన్నారు. ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, ఎంపీ సర్వే సత్యనారాయణ లాంటి వారికి తెలంగాణపై మాట్లాడే అవకాశం దొరికిందన్నారు. తెలంగాణ కోసం పార్టీలు అన్ని ఐక్యంగా ఉద్యమించాలని సూచించారు. తెలంగాణ కోసం పోరాటం చేసే విద్యార్థులను క్రిమినల్స్గా చిత్రీకరించే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న వాతావరణాన్ని అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరుతామని చెప్పారు. మంత్రులు, ఎంపీలకు మధ్య చిన్న చిన్న సమస్యలున్నా వ్యూహాత్మకంగా ముందుకెళతామన్నారు. రెండు రోజుల్లో తెలంగాణ కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తుందన్నారు.












Click it and Unblock the Notifications