వైయస్ హత్యకు 'రిలయన్స్'కు లింక్: అంబటి

రిలయన్స్, కెజి బేసిన్ దోపిడీపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. రిలయన్స్ పైన సిబిఐ ఎంక్వయిరీ వేస్తే దొంగలెవరో తేలుతుందన్నారు. రిలయన్స్ రాష్ట్రాన్ని వేల కోట్ల రూపాయల దోపిడీ చేస్తుంటే అప్పుడు ఓ ప్రధాన పత్రిక కనీసం ఒక్క చిన్న వార్త కూడా రాయలేదన్నారు. ఆ పత్రికలో రిలయన్స్ వాటాలు ఉన్నందు వల్లే వార్తలు ప్రచురించలేదని అర్థమవుతోందన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వైయస్సార్సీ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి, అక్రమాలపై బస్సుయాత్ర నిర్వహిస్తానని చెప్పడాన్ని అంబటి ఖండించారు. డిఎల్ బస్సుయాత్ర చేస్తే ప్రజలే బుద్ది చెబుతారన్నారు.












Click it and Unblock the Notifications