బాన్సువాడపై చేతులు దులుపేసుకున్న చంద్రబాబు
కాగా అంతకుముందు సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావు మాట్లాడుతూ అందరూ రాజీనామాలు చేసి ఎన్నికలు బహిష్కరిస్తే తప్ప కేంద్రం తెలంగాణపై దిగి రాదన్నారు. తమ వ్యాఖ్యలపై స్పందించాల్సింది కెటి రామారావు కాదని టిఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు అన్నారు. పార్టీలు జెండాలు పక్కన పెట్టి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణపై చిత్తశుద్ధి ఉంటే పోచారం పోటీకి దూరంగా ఉండాలని మరో ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు డిమాండ్ చేసారు. తెలంగాణ వచ్చాక పోచారంను బాన్సువాడ ఎమ్మెల్యేగా ఏకగ్రీవంగా నిలబెడతామన్నారు.
తెలుగుదేశం పార్టీకి, శాసనసభా సభ్యత్వానికి పోచారం శ్రీనివాస రెడ్డి రాజీనామా చేయడంతో నిజామాబాద్ జిల్లా బాన్సువాడ శాసనసభా నియోజకవర్గానికి ఇసి ఉప ఎన్నికను ప్రకటించింది. శ్రీనివాస రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) తరఫున పోటీ చేయనున్నారు. బాన్సువాడలో పోటీ చేసేందుకు కాంగ్రెసు పార్టీ సమాయత్తమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.