నేను చాలా డిఫరెంట్: సిఎం కిరణ్ కుమార్ రెడ్డి

అవినీతికి పాల్పడే రాజకీయ నాయకులను కఠినంగా శిక్షించాలన్నారు. అవినీతికి పాల్పడ్డ నేతలు కొందరు ఇప్పటికే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్లారన్నారు. రాజకీయ నాయకులకు అత్యాశ ఉండకూడదన్నారు. అవినీతిపై లోక్ పాల్ వంటి ఎన్ని చట్టాలు చేసిన ఫలితం ఉండదన్నారు. పారదర్శక పాలనతోనే అది సాధ్యమవుతుందన్నారు. అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పాఠశాలల్లో అహింసపై పోటీలు నిర్వహిస్తామని చెప్పారు. గెలిచిన వారికి భారీ పారితోషికం ఉంటుందన్నారు. కాగా అంతకుముందు అపోలోలో చికిత్స పొందుతున్న ఎంపీ అజహరుద్దీన్ తనయుడు అయాజుద్దీన్ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మంచి చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు.












Click it and Unblock the Notifications