గాలిపై కేసుకు సిబిఐకి ఏడాది పట్టింది

కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉందని, ఈ స్థితిలో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ ఇస్తే దర్యాప్తు దెబ్బ తింటుందని, గాలి జనార్దన్ రెడ్డి కేసు దర్యాప్తును ప్రభావితం చేసే ప్రమాదం ఉందని సిబిఐ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ప్రజాప్రతినిధిగా ఉన్న గాలి జనార్దన్ రెడ్డిని సరైన సాక్ష్యాలు లేకుండా అరెస్టు చేయడం కుదరదనే విషయం సిబిఐకి తెలుసు. బలమైన సాక్ష్యాలు ఉంటే తప్ప ఎఫ్ఐఆర్లో గానీ రిమాండ్ రిపోర్టులో గానీ గాలి జనార్దన్ రెడ్డి వంటి ప్రజాప్రతినిధి పేరు చేర్చడానికి వీలు కాదు. అలా చేస్తే ఎదురయ్యే ప్రమాదం ఏమిటో దర్యాప్తు సంస్థలకు తెలుసు. అందుకే బలమైన సాక్ష్యాధారాలను సేకరించడానికి సిబిఐ సమయం తీసుకున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications