ఎబిఎన్ ఆంధ్రజ్యోతిపై పోలీసులకు అంబటి ఫిర్యాదు

Ambati Rambabu
హైదరాబాద్: తనపై తప్పుడు వార్తాకథనాలను ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు హైదరాబాదులోని బంజారాహిల్స్ పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఉదయం నుంచి తనపై తప్పుడు కథనాలను ప్రసారం చేస్తోందని ఆయన విమర్శించారు. అందులోని వాస్తవాలను బయటపెట్టాలని ఆయన పోలీసులను కోరారు. ఎబిఎన్ ఆంధ్రజ్యోతి వార్తాకథనం ప్రసారం వెనక కుట్రను బయటపెట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఎబిఎన్ ఆంధ్రజ్యోతి చానెల్‌పై ఆయన మీడియా ప్రతినిధుల వద్ద ఘాటుగా స్పందించారు. కోన్‌కిస్కా గొట్టం చానెల్‌కు స్పందించేదేమిటని ఆయన ప్రశ్నించారు. అవన్నీ తప్పుడు కథనాలేనని ఆయన అన్నారు. వాస్తవాలను మీడియా ప్రతినిధులే వెలుగులోకి తేవాలని ఆయన కోరారు. ఎబిఎన్‌కు, తనకు మధ్య విభేదాలున్నాయని ఆయన చెప్పారు. ఆ చానెల్ ప్రారంభమైన తర్వాత ఇప్పటి వరకు తాను ఎప్పుడూ ఆ చానెల్‌లో చర్చకు కూర్చోలేదని ఆయన చెప్పారు. బ్లాక్ మెయిల్ చేయడం ఆ చానెల్‌కు అలవాటేనని ఆయన విమర్శించారు. వాటిని బయటపెడతామని ఆయన హెచ్చరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+