గాలి జనార్దన్ రెడ్డి డ్రైవర్ ఇంట్లో సిబిఐ సోదాలు

కాగా, బళ్లారి తీసుకుని వెళ్లిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస రెడ్డి రెండు లాకర్లను సిబిఐ అధికారులు తెరిచారు. బాళ్లారిలోని యాక్సిస్ బ్యాంకులో ఆ లాకర్లను తెరిచిన నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల పేర్ల మీద నాలుగు లాకర్లు ఉన్నట్లు వారు గుర్తించారు. వాటిలో రెండింటిని మాత్రమే తెరిచారు. శ్రీనివాస రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఖాతాల నుంచి వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు సిబిఐ అధికారులు గుర్తించారు.
కాగా, కర్ణాటక మాజీ మంత్రి, గాలి జనార్దన్ రెడ్డి ముఖ్య అనుచరుడు గాలి శ్రీరాములును కూడా సిబిఐ అధికారులు విచారిస్తారనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో శ్రీరాములు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అక్రమ గనుల కేసులో సిబిఐకి పూర్తిగా సహకరిస్తానని ఆయన చెప్పారు. అక్రమ గనుల కేసులో గాలి జనార్దన్ రెడ్డి దోషి కారని, నిందితుడు మాత్రమేనని ఆయన అన్నారు. తనది తప్పించుకుని తిరిగే మనస్తత్వం కాదని ఆయన అన్నారు. తనకు సిబిఐ నుంచి ఏ విధమైన నోటీసు కూడా అందలేదని ఆయన చెప్పారు. తన రాజీనామా డ్రామా కాదని ఆయన అన్నారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications