జెఎసి నేతల చేతికి జైపాల్ యాదవ్ రాజీనామా లేఖ

జైపాల్ యాదవ్ నుంచి రాజీనామా లేఖను తీసుకున్న జెఎసి నేతలు కల్వకుర్తిలోని ఓ టెలిఫోన్ బూత్ నుంచి శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్కు ఫాక్స్ చేశారు. శుక్రవారం కూడా ఇటువంటి సంఘటనే మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. తెలుగుదేశం శాసనసభ్యుడు రేవంత్ రెడ్డిని తెలంగాణావాదులు అడ్డుకుని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కాగితంపై సంతకం చేసి రాజీనామా లేఖను వారి చేతికి ఇచ్చారు. తాము రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించలేదని ఆయన చెప్పారు. మహబూబ్నగర్ జిల్లా ఆలంపూర్ కాంగ్రెసు శాసనసభ్యుడు అబ్రహం శనివారం మరోసారి రాజీనామా చేశారు. తెలంగాణ కోసం ఆయన తన రాజీనామా లేఖను ఫాక్స్ ద్వారా స్పీకర్ నాదెండ్ల మనోహర్కు పంపించారు.












Click it and Unblock the Notifications