తెలంగాణ సమ్మె ప్రభావం కేంద్రంపై ఉండదు: సిఎం

సమ్మె ద్వారా బొగ్గు ఉత్పత్తిని నిలిపేయడాన్ని ఆయన ఖండించారు. కొంత మంది సింగరేణి కార్మికులు పనిచేస్తుంటే వారిని కూడా ఆపించడానికి బస్సులో వెళ్తున్నారని, ఇది సరి కాదని ఆయన అన్నారు. సమ్మె వల్ల పోటీ పరీక్షలకు తయారవుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లుతోందని, తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు భయపడుతున్నారని ఆయన అన్నారు. బస్సులను ఆపడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, దీనిపై ఆందోళనకారులు ఆలోచించాలని ఆయన అన్నారు. బయటి ప్రాంతాలవారికి ఇబ్బందులు కలుగుతున్నా ఎక్కువగా తెలంగాణ ప్రజలకే ఇబ్బంది కలుగుతోందని ఆయన అన్నారు. సమ్మెను వెంటనే విరమించుకోవడం మంచిదని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలు ఇప్పటికే కేంద్రానికి చేరాయని, సమ్మె వల్ల కొత్తగా చెప్పేదేమీ లేదని ఆయన అన్నారు.
సమ్మె వల్ల సంక్షేమ పథకాలకు ఆటంకం కలుగుతోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుందని ఆయన అన్నారు. తమ కాంగ్రెసు పార్టీ ఇప్పటికే చర్చలు జరుపుతోందని, త్వరలో చర్చలు ముగుస్తాయని గులాం నబీ ఆజాద్ చెప్పారని ఆయన అన్నారు. కేంద్రం తెలంగాణపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆయన అన్నారు. మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించినప్పుడు అందుకు ఆయన నిరాకరించారు. తాను మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఆహ్వానించదలుచుకోలేదని, విజ్ఞప్తి చేయడానికి మాత్రమే తాను మాట్లాడానని ఆయన చెప్పారు. మీడియా ప్రతినిధుల ప్రశ్నలను ఆహ్వానిస్తే తాను చెప్పే మాటల వల్ల పెడర్థాలకు దారి తీసే ప్రమాదం ఉందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications