తెలంగాణపై మేం చెప్పాల్సింది చెప్పాం: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణపై తాము చెప్పాల్సింది చెప్పామని, నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి అన్నారు. పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు. సకల జనుల సమ్మె జఠిలంగా మారుతోందని, దానిపై స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. సమస్యను పరిష్కరించాలనే ఆలోచన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదా అని ఆయన అడిగారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసమర్థంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య పడడం లేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన లీజు గడువు ముగిసిందని భావిస్తున్నారని, దాన్ని పొడగించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాప్రతినిధులు పరస్పరం విమర్శించుకుంటూ అధికారం కోసం పాకులాడుతున్నారు తప్ప ప్రజాసమస్యలపై ఆలోచించడం లేదని ఆయన విమర్శించారు. వైయస్ రాజశేఖర రెడ్డి స్వార్థంతో తన స్వలాభం కోసం మాత్రమే పనిచేశారని ఆయన అన్నారు. ప్రజలు సమస్యల్లో ఉన్నారని, వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని, అందుకు గాను నవంబర్ 1వ తేదీ నుంచి జనచైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లాలని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+