హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాంతి భద్రతలపై రాజీ వద్దు: డిజిపితో సిఎం కిరణ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kiran Kumar Reddy
హైదరాబాద్: శాంతి భద్రతలపై రాజీ వద్దని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం డిజిపి దినేష్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణవ్యాప్తంగా సకల జనుల సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో ఆయన డిజిపి దినేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్వీ ప్రసాద్, ఇంటెలిజెన్స్ ఐజి తదితరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన సంఘ విద్రోహ శక్తులను అణిచి వేయాలని వారిని ఆదేశించారు. శాంతి భద్రతలపై ఎలాంటి రాజీ వద్దని తేల్చి చెప్పారు. షాపింగ్ మాల్సు తదితరాల ముఖ్య ప్రాంతాల వద్ద అవసరమైతే గట్టి భద్రతతో పాటు నిఘా సైతం కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆదేశించారు. అవసరమైన ప్రాంతాలలో అదనపు బలగాలను మోహరించమని ఆజ్ఞాపించారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారున్నారని వారందరికీ భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణేతరులకూ భద్రత కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

English summary
CM Kiran Kumar Reddy ordered police that to maintain law and order.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X