చంద్రబాబు అమ్ముడుపోయారు: వైయస్ జగన్ దాడి

YS Jagan
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రిటైల్‌గానూ హోల్‌సేల్‌గానూ అమ్ముడుపోయారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తమ కష్టాలను ప్రతిపక్షమైనా పట్టించుకుంటుందని ప్రజలు అనుకుంటే, ఆ స్థానలో చంద్రబాబు ఉండటం మన కర్మ అని ఆయన అన్నారు. ప్రజా సమస్యలను పట్టించుకునే స్థితిలో చంద్రబాబు లేరని, చంద్రబాబు దృష్టంతా రెండేళ్ల క్రితం చనిపోయిన వైయస్సార్ మీదనే ఉందని ఆయన అన్నారు. వైయస్సార్‌ను అప్రతిష్టపాలు చేయడమే ఎజెండాగా కాంగ్రెసుతో కుమ్మక్కయి కోర్టుల దాకా తన కుట్ర రాజకీయాలను తీసుకుని వెళ్తున్నాడని ఆయన వ్యాఖ్యానించారు.

మంగళవారం విజయవాడలో ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కుళ్లు, కుతంత్రాలే రాజకీయంగా, కళ్లార్పకుండా వంద అబద్ధాలనైనా చెప్పగలిగే చాతుర్యం, పదవి కోసం మామను కూడా వెన్నుపోటు పొడిచారన్న సందర్భాల్లో మనకు గుర్తుకు వచ్చే పేరు చంద్రబాబు అని ఆయన అన్నారు. వైయస్ చనిపోయాక రాష్ట్రం పరిస్థితి చూస్తే బాధేస్తోందని ఆయన అన్నారు. వరి వేసుకోవడం కన్నా ఉరి వేసుకోవడం నయమని రైతు అంటున్నాడని ఆయన అన్నారు. 108 సేవల తీరు పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రైతులకు మద్దతుగా ఈ నెల 1వ తేదీన తలపెట్టిన ధర్నాకు తరలి రావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+