హైదరాబాద్ బంద్, నిర్మానుష్యంగా రాజధాని రోడ్లు

Telangana Bandh
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కోసం జరుగుతున్న సకల జనుల సమ్మెలో భాగంగా శుక్రవారం హైదరాబాదు బందుకు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. బందు కారణంగా హైదరాబాదులో దాదాపు అన్ని వ్యవస్థలు ఎక్కడికక్కడ స్తంభించి పోయాయి. రైల్వే అధికారులు ముందస్తుగా ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేశారు. ఇప్పటికే ఆర్టీసి సమ్మెలో పాల్గొంటున్న కారణంగా ఆర్టీసి బస్సులు రహదారుల పైకి రావడం లేదు. తెలంగాణ ప్రజలు స్వచ్చంధంగా బందులో పాల్గొంటున్నారు. దుకాణాలు మూసివేశారు. ఆటోలు రోడ్లెక్కలేదు. దీంతో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. బందు ప్రభావం సామాన్య జనాలపై పడుతోంది. బందు కారణంగా ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

కాగా ఇదే ఆఖరు బందు అని అందరూ సహకరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం నాటి బందుకు అందరూ సహకరించాలని తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ సమితి(జెఏసి) చైర్మన్ ఆచార్య కోదండరాం ప్రకటన సమయంలోనే విజ్ఞప్తి చేశారు. మరో వైపు వనస్థలిపురంలో సచివాలయ ఉద్యోగులను విధులకు పంపించడంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా భారీగా పోలీసులను మోహరించారు. మూడు రోజుల క్రితం తెలంగాణవాదులు సచివాలయ ఉద్యోగుల బస్సులను అడ్డుకొని అద్దాలు పగుల గొట్టిన విషయం తెలిసిందే. శుక్రవారం ఒక బృందం అర్ఏఎఫ్‌తో పాటు నాలుగు స్టేషన్ల పోలీసులను మోహరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+