సమైక్యాంధ్రకే మొగ్గు చూపుతున్న సీమాంధ్ర నేతలు
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదన్నారు. ఆయన ఒక్కోసారి మాట్లాడుతారన్నారు. ఆయన మాటలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గతంలో మంత్రులపై అవినీతి ఆరోపణలు వస్తే రాజీనామా చేసే వారన్నారు. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంపై ఆరోపణలు వచ్చినప్పుడు మంత్రులు రాజీనామా చేశారన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ఆయన శంకర్ రావు జిందాబాద్ అని నినాదం చేశారు.
కాగా తాము సమైక్యాంధ్రనే కోరుకుంటున్నామని మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని చెప్పారు. మరోసారి రాజీనామా చేసే ప్రసక్తి లేదన్నారు. రాయల తెలంగాణ ప్రతిపాదన కేంద్రం నుండి రాలేదన్నారు. తెలంగాణపై చర్చకు ఆ పార్టీ అధినేత కె చంద్రశేఖర రావు ఓ మెట్టు దిగి రావడం మంచి పరిణామం అన్నారు. మరోవైపు రాయపాటి సాంబశివ రావు సైతం సమైక్యమే అని చెబుతున్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఆంధ్రలో కాంగ్రెసు గల్లంతవుతుందని హెచ్చరించారు. పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రంలో కొద్ది రోజులు రాష్ట్రపతి పాలన విధించవచ్చన్నారు.