తెలంగాణపై దసరా తర్వాత కిరణ్, బొత్సలతో కసరత్తు

Botsa Satyanarayana-Kiran Kumar Reddy
హైదరాబాద్: తెలంగాణపై దసరా తర్వాత నిర్ణయం తీసుకోవడానికి కాంగ్రెసు అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని పరిస్థితుల దృష్ట్యా తగిన నిర్ణయాలు తీసుకోవడానికి వీలుగా అందుబాటులో ఉండాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ఆదేశించినట్లు తెలుస్తోంది. జిల్లా పర్యటనలు, ప్రత్యేక కార్యక్రమాలు పెట్టుకోవద్దని కూడా ఆదేశించినట్లు సమాచారం. అలాగే పండుగ తరువాత ఢిల్లీకి రావాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను కూడా కోరినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనరసింహ, మంత్రులు డి.ఎల్, ధర్మాన తదితరులు సోమవారం సమావేశమయ్యారు.

ప్రత్యేక సమైక్య వాదాలు, సమ్మె అంశాలపై వారు చర్చలు జరిపారు. రాష్ట్రంలో పరిస్థితులు సాధారణ స్థాయికి వచ్చే విధంగా తీసుకోవాల్సిన చర్యలపైనా చర్చ జరిగింది. మంత్రివర్గ సమావేశం జరపలేని పరిస్థితులపై కూడా సమావేశం దృష్టి పెట్టింది. దసరా తరువాత అందుబాటులో ఉండాలని అధిష్ఠానం తనకు సూచించిందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించినట్లు తెలిసింది.

కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ దసరా పండుగ జరుపుకొనేందుకు ప్రస్తుతం కోల్‌కతాలో ఉన్నారు. పండుగ తర్వాత ఆయన ఢిల్లీ తిరిగి వస్తారు. ఇలా ప్రణబ్ ఢిల్లీ వచ్చాక కిరణ్‌కు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చే అవకాశాలుంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 7,8 తేదీల్లో జిల్లా పర్యటనలు, ఇతర అధికారిక కార్యక్రమాలు వేటినీ ముఖ్యమంత్రి పెట్టుకోలేదు. దీన్ని బట్టి ఈ రోజుల్లో ఆయన ఢిల్లీకి వెళ్లే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+