కాంగ్రెసు విలీనం ప్రకటనపై భగ్గుమన్న హరీష్

తెలంగాణపై కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రకటనను ఆయన ఖండించారు. తెలంగాణ ఇవ్వకపోతే పరిస్థితి మరోలా ఉంటుందని ఆయన అన్నారు. తెరాస తెరాసగానే ఉంటుందని, ఏ పార్టీలోనూ విలీనం కాదని ఆయన అన్నారు. తమ గురించి మాట్లాడాలని తాము ఎవరికీ చెప్పలేదని ఆయన అన్నారు. విలీనం గురించి కాంగ్రెసు నాయకులు అనుకుంటున్న మాటలే తప్ప తమకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన అన్నారు. తెలంగాణ విషయం 2004లో తమతో పొత్తు పెట్టుకున్నప్పుడు గానీ యుపిఎ ఉమ్మడి కార్యాచరణలో చేర్చినప్పుడు గానీ రాష్ట్రపతి ప్రసంగంలో చేర్చినప్పుడు గానీ ప్రణబ్ ముఖర్జీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications