Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చుక్కా రామయ్యను బోధనను తప్పు పట్టిన సిఎం

Kirankumar Reddy
సంగారెడ్డి: ఐఐటి ఉమ్మడి ప్రవేశ పరీక్షకు విద్యార్థులను సిద్ధం చేయడంలో సిద్ధహస్తుడైన తెలంగాణకు చెందిన విద్యావేత్త చుక్కా రామయ్యను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తప్పు పట్టారు. చుక్కా రామయ్య విద్య నేర్పే పద్ధతిని తాను సమర్థించబోనని ఆయన అన్నారు. చుక్కా రామయ్య విద్యా సంస్థలపై ఆయన విరుచుకుపడ్డారు. తెలుగు విద్యార్థులకు ఐఐటి ప్రవేశాలను రుచి చూపించింది రామయ్యనే. దాంతో ఆయన ఐఐటి రామయ్యగా ప్రసిద్ధి పొందారు. విద్యార్థులపై ఒత్తిడి పెంచడం మంచిది కాదని ముఖ్యమంత్రి అన్నారు. ప్రతి రోజూ ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల చదువు వల్ల విద్యార్తులు ఒత్తిడికి గురవుతారని ఆయన అన్నారు.

సాంకేతిక విద్య పేదలకు అందినప్పుడే నిజమైన అభివృద్ధి అని ఆయన అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది గ్రామంలో రూ. 400 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఐఐటి హైదరాబాద్ తొలి దశ భవనాలకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటైన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఐఐటి మెదక్‌ జిల్లాలోనే ఉన్నా దీన్ని ఐఐటి హైదరాబాద్ అని పిలవాలని ఆయన అన్నారు. దిశానిర్దేశం లేని చదువు, కార్యక్రమాలు ఫలితాన్ని ఇవ్వవని ఆయన అన్నారు. అనుకున్నది సాధించేందుకు నిర్దిష్ట ప్రణాళిక, కసరత్తు అవసరమని ఆయన అన్నారు. మన విద్యార్థుల ప్రతిభను చూసి అమెరికా సైతం తమ విద్యార్థులను హెచ్చరిస్తోందని ఆయన అన్నారు. ఇంజనీరింగ్, వైద్య విద్యలు మాత్రమే విద్యలు కావని కూడా ఆయన అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+