వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ రైల్ రోకో వాయిదా, తేదీల్లో మార్పులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodandaram
హైదరాబాద్: ఈ నెల 9,10,11 తేదీల్లో తలపెట్టిన రైల్ రోకోను తెలంగాణ జెఎసి వాయిదా వేసుకుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుతో పాటు తెలంగాణ జెఎసి నాయకులు సమావేశమై రైల్ రోకోలో స్వల్ప మార్పులు చేయాలని నిర్ణయించుకున్నారు. రైల్ రోకోను 12,13,14 తేదీల్లో నిర్వహిస్తామని సమావేశానంతరం తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరామ్ శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ మూడు రోజుల్లో తెలంగాణ ఉద్యోగుల మహా ధర్నా ఉందని, తెలంగాణ జెఎసి సింగరేణి యాత్ర ఉంటుందని, ఈ కారణాల వల్ల రైల్ రోకో కార్యక్రమంలో మార్పులు చేశామని ఆయన చెప్పారు. అయితే, రేపు జరిగే జెఎసి విస్తృత స్థాయి సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తామని ఆయన చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని ఆయన చెప్పారు. పోలీసులు రెచ్చగొట్టినా తమ ఉద్యమం శాంతియుతంగా సాగుతుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి 1350 మెగావాట్ల విద్యుత్తు ఇస్తామని మన్మోహన్ సింగ్ హామీ ఇచ్చారని, దాన్ని సరిగా పంపిణీ చేస్తే రైతులకు ఏడు గంటలు విద్యుత్తు అందించడానికి వీలవుతుందని ఆయన అన్నారు. పది, పదిహేను రోజుల్లో రైతుల పంటలు చేతికి వస్తాయని, అంత వరకు ఏడు గంటలు రైతులకు విద్యుత్తు అందించాలని ఆయన అన్నారు. ఆర్టీసి కార్మికులకు వేతనాలు ఇస్తామని రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారని, మళ్లీ బొత్సతో మాట్లాడుతామని ఆయన అన్నారు.

సమ్మె విరమించి విధుల్లో చేరినవారికి మాత్రమే అడ్వాన్సులు చెల్లిస్తామని అంతకు ముందు ఆర్టీసి ఎండి ప్రసాదరావు చెప్పారు. ఆర్టీసిని ప్రైవేటీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న సమయంలో కార్మికులు సమ్మె చేయడం సరి కాదని, వారు పునరాలోచన చేసుకోవడం మంచిదని ఆయన అన్నారు. ఆర్టీసికి ఇప్పటికే 140 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని ఆయన అన్నారు.

English summary
Telangana rail roko was postponed. This was announced by Telangana JAC chairman Kodandaram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X