వైయస్ జగన్ టార్గెట్లపై తెలంగాణ నేతల అసంతృప్తి

YS Jaganmohan Reddy
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ సభ్యత్వ నమోదుకు సంబంధించి పార్టీ నాయకలకు టార్గెట్లు పెడుతున్నారు. ఈ టార్గెట్లపై తెలంగాణకు చెందిన నాయకులు తీవ్ర వ్యతిరేకత ప్రదర్సిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ బుధవారం తెలంగాణకు చెందిన నాలుగు జిల్లాల నాయకులతో సమీక్ష చేశారు. ఈ సమీక్షలో సభ్యత్వ నమోదు విషయమై టార్గెట్లు ఇచ్చినట్లు సమాచారం. తమకు టార్గెట్లు ఇవ్వవద్దని వారు జగన్‌ను కోరినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పరిస్థితిపై వారు జగన్‌కు మొర పెట్టుకున్నట్లు చెబుతున్నారు. మీరు ఉద్యమంలో పాల్గొనాలని చెప్పిన జగన్ తెలంగాణపై స్పష్టత ఇవ్వడానికి సుముఖంగా లేరని అంటున్నారు. తెలంగాణకు అనుకూలంగా వైఖరిని ప్రకటించకుండా పార్టీ సభ్యులుగా చేరాలని ప్రజల వద్దకు తాము వెళ్లలేని పరిస్థితి ఉందని వారు తమ గోడును వెల్లబోసుకున్నట్లు చెబుతున్నారు.

నవంబర్ 1వ తేదీ లోగా మండల, గ్రామస్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా నాయకులకు ఆయన 20 శాతం ప్రజలను పార్టీ సభ్యులుగా చేర్చాలనే టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో తెలంగాణపై తన వైఖరిని కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పినట్లు తెలుస్తోంది. తాము తెలంగాణకు అనుకూలమూ కాదు, వ్యతిరేకమూ కాదని ఆయన చెప్పారని తెలుస్తోంది. మిగతా పార్టీల మాదిరిగానే వ్యవహరించాలని ఆయన పార్టీ నాయకులకు సూచించినట్లు సమాచారం. ఇంతకాలం ఓదార్పు యాత్రలతో బిజీగా గడిపిన వైయస్ జగన్ ఇప్పుడు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై దృష్టి సారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+