దొరల పాలనపై కెసిఆర్‌కు లగడపాటి లేఖాస్త్రం

Lagadapati Rajagopal
విజయవాడ: ఎప్పుడూ ఏదో హడావిడి చేసే కాంగ్రెసు విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తాజాగా బుధవారం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావుకు లేఖ రాశారు. తెలంగాణపై కెసిఆర్‌కు ఆయన పాఠాలు చెప్పే పనికి పూనుకున్నారు. తెలంగాణలో సాగిన దొరల పాలనపై వెలువడిన పుస్తకాలు చదివి వాస్తవాలు గ్రహించాలని ఆయన కెసిఆర్‌కు సూచించారు. దీంతో వారికి వారు సరిదిద్దుకోవడంతో పాటు ప్రజలకు కూడా నిజాలు చెప్పగలుగుతారన్నారు. తెలంగాణలో ఆంధ్రకు చెందిన పాలకుల దుర్నీతిపై కానీ, అణచివేత గురించి కాని ఒక్క పుస్తకం కూడా లేదన్న విషయం గ్రహించాలని ఆయన గుర్తు చేశారు.

ఆంధ్రప్రదేశ్ అవతరణకు ముందు తెలంగాణ ప్రజలపై సాగిన అణచివేత, దురహంకార పాలన రాతి గుండెలను కూడా కరిగిస్తాయని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతం 200 సంవత్సరాల పాటు దొరలు, పటేళ్ళు, పట్వారీల పదఘట్టనల కింద నలిగిపోయిందన్నారు. నియంతృత్వ విధానాలు, వెట్టి చాకిరీ విధానాన్ని అడ్డుకునేందుకు జరిగిన తెలంగాణ సాయుధ పోరాటాన్ని మించిన పోరాటం మరొకటి చరిత్రలో లేదని వివరించారు. సుదీర్ఘకాలం పాటు నియంతృత్వ పాలనలో మగ్గిపోయిన తెలంగాణ ప్రాంతం విశాలాంధ్ర ఏర్పడిన తరువాత మాత్రమే స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు, హక్కులను అనుభవించగలిగిందని తెలిపారు.

తెలంగాణకు సంబంధించిన అంశాలపై ఆ ప్రాంత రచయితలు, కవులు రాసిన 12 పుస్తకాలు, ఒసేయ్ రాములమ్మ వంటి సినిమాల సీడీలను ఆయన కెసిఆర్‌కు పంపారు. ఆ పుస్తకాలు చదివి వాస్తవాలు తెలుసుకుంటే కెసిఆర్ మారుతారని, తరువాత ప్రజలకు కూడా వాస్తవాలు చెప్పగలుగుతారని లగడపాటి అన్నారు. కేసీఆర్ పేరిట ఉన్న ఈ లేఖను టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రాజగోపాల్ పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+