హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వెళ్లాడు సిబిఐ వచ్చింది, ఆరో రోజూ మదింపు

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: లోటస్ పాండులోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఆరో రోజు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) అధికారుల బృందం ఆస్తుల మదింపు జరుపుతోంది. సిబిఐ అధికారులతో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా మదింపులోపాల్గొన్నారు. నిర్మాణం, ఫర్నీచర్ విలువలు కడుతున్న ప్రతి చోటా సాక్ష్యాధారాల కోసం అధికారులు వీడియో చిత్రీకరణ జరుపుతున్నారు. ఇప్పటి వరకు రెండు అంతస్తుల అంచనా మదింపు పూర్తయిందని, మూడంతస్తుల మరో అంతస్తు అంచనా మదింపు మిగిలి ఉందని సమాచారం.

కాగా గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ బుధవారం దీపావళి పండుగ కావడంతో తన పర్యటనను ఒకరోజు వాయిదా వేసుకొని హైదరాబాద్ వచ్చిన విషయం తెలిసిందే. ఆయన తిరిగి గురువారం ఉదయం తన ఓదార్పు కోసం గుంటూరు బయలు దేరి వెళ్లారు. ఆయన అలా వెళ్లగానే సిబిఐ అధికారులు ఆస్తుల మదింపు కోసం ఇలా వచ్చారు.

English summary
CBI officers estimating YSRC Party president YS Jaganmohan Reddy's residence on sixth day.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X