పొలంలో దొరికిన 115 బంగారు నాణేలు లభ్యం

బంగారు నాణేలు బయటపడిన విషయాన్ని కొందరు గ్రామ ప్రజలు పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి 115 బంగారు నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో నాణెం బరువు 1 నుంచి 3 గ్రాముల వరకు ఉంటుందని పోలీసు అధికారి చెప్పారు. ఆ నాణేలు ప్రాచీనమైనవని, మరిన్ని బంగారు నాణేలు ఉండవచ్చుననే ఉద్దేశంతో అన్వేషణ సాగుతోందని, బంగారు నాణేల గురించి పురాతత్వ శాఖ అధికారులను గ్రామ ప్రజలను విచారిస్తున్నారని, అవి ఏ కాలానికి చెందినవో గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన వివరించారు. మనపాడు పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications