తెరాస అధినేత కెసిఆర్పై విరుచుకుపడిన కెకె

తెలంగాణ కోసం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస), కాంగ్రెసు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా తమతో కలుపుకుని పోతామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించి తీరుతామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాటం ఆగదని ఆయన అన్నారు. తమ సహనానికి కూడా పరిమితి ఉందని, తెలంగాణ ఇవ్వకపోతే దేనికైనా సిద్ధపడుతామని ఆయన అన్నారు. తెలంగాణపై తాము కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేస్తున్నామని, మనమే ఇచ్చి తీరాలని చెబుతున్నామని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీయే తెలంగాణ తెస్తుందని, ఒత్తిడి ద్వారానే తెలంగాణ సాధించగలుగుతామని ఆయన అన్నారు. తాము ఢిల్లీకి కొన్నిసార్లు బహిరంగంగా, కొన్ని సార్లు రహస్యంగా వస్తున్నామని, మీడియా ఏవేవో రాస్తోందని ఆయన అన్నారు. తాము బిచ్చమడుగుతామా, బితిమిలాడుతామా, తెలంగాణ తెచ్చుకుంటామని ఆయన అన్నారు. కాంగ్రెసును చీలిస్తే తెలంగాణ ఉద్యమానికి దెబ్బ తగులుగుతుందని ఆయన అన్నారు. తెలంగాణ కోసం దేనికైనా సిద్ధమని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తారనే పూర్తి నమ్మకం సోనియాపై ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై రాజీ పడే ప్రసక్తి లేదని సోనియాకు, కేంద్ర హోం మంత్రి చిదంబరానికి చెప్పామని ఆయన అన్నారు. తెలంగాణను ఇచ్చే సామర్ధ్యం కాంగ్రెసుకే ఉందని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు. పార్టీలను చీల్చడం వల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన వెనక పడుతుందని ఆయన అన్నారు. పార్టీలను చీల్చడం మంచిది కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications