వైయస్ జగన్ ఆస్తుల కేసులో పెదవి విప్పని సిబిఐ

గాలి జనార్దన్ రెడ్డికి బ్రాహ్మణి స్టీల్స్కు 10,670 ఎకరాలను వైయస్సార్ ప్రభుత్వం తక్కువ ధరకు కేటాయించడమే కాకుండా దానికి వాడుకునేందుకు ఇనుప ఖనిజం గనులను కూడా ఇచ్చింది. బ్రాహ్మణి స్టీల్స్ ప్రారంభమయ్యే లోగా ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేసుకునేందుకు కూడా గాలి జనార్దన్ రెడ్డికి చెందిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలోనే ప్రభుత్వంపై ఒత్తిడి పనిచేసిందనే భావనతో ఉన్నారు. అంతేకాకుండా ఓఎంసిలో పెట్టుబడులు ఉన్న ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ సంస్థలు జగన్ కంపెనీల చిరునామాలోనే ఉన్నాయి. ఇక్కడ అక్రమ గనుల సొమ్ము జగన్ కంపెనీల్లోకి చేరిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, సిబిఐ ముందు జగన్ హాజరయ్యే తేదీని వాయిదా వేయాలని జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయి రెడ్డి కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన తిరుపతిలో జగన్ తన ముఖ్య అనుచరుడు బి. కరుణాకర్ రెడ్డి కూతురు పెళ్లికి హాజరు కావాల్సి ఉంది. దాంతో ఆ తేదీని వాయిదా వేయాలని సిబిఐని విజయసాయిరెడ్డి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. గుంటూరు జిల్లాలో జగన్ తొలి విడత ఓదార్పు యాత్ర బుధవారం సాయంత్రం ముగిసింది. జగన్ నవంబర్ 3, 4 తేదీల్లో హైదరాబాదులో ఉంటున్నారు. కాగా, ఈ నెల 4వ తేదీన జగన్ సిబిఐ ముందుకు రానున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.
-
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications