తెలంగాణ సోనియాకు అగ్ని పరీక్ష: జీవన్ రెడ్డి

పోలీసులతో ఉద్యమాన్ని అణిచి వేయలేరని ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నల్గొండలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరంలో అన్నారు. కేంద్రం తెలంగాణ ఇవ్వకుంటే పార్లమెంటు సెషన్లు అడ్డుకుంటామన్నారు. తెలంగాణ వచ్చే వరకు ఉద్యమం ఆగే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ మంత్రులు కేవలం ప్రకటనలకే పరిమితవుతున్నారని మరో ఎంపీ రాజయ్య ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి తెలంగాణ సాధిస్తామన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ ప్రకటించాలన్నారు. 1969 నాటి ఉద్యమం ఇప్పుడు కాదన్నారు. మభ్య పెట్టాలని చూసినా అలాంటి వారెవరు ఇప్పుడు లేరన్నారు.
కాంగ్రెసు తెలంగాణ ఇవ్వకపోతే ఈ ప్రాంతంలో కనుమరుగు కావడం ఖాయమని ఎమ్మెల్యే చిరుముర్తి లింగయ్య అన్నారు. తాము తెలంగాణ రాష్ట్రం కొత్తగా అడగటం లేదని గతంలో ఉన్నదానినే అడుగుతున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దీక్షా శిబిరం వద్ద మాట్లాడుతూ అన్నారు. తనకు ఇంతగా మద్దతు రావడం చూస్తుంటే ఉత్సాహం పెరిగి పట్టుదల పెరుగుతోందన్నారు. తనను అరెస్టు చేసినా ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తానని చెప్పారు. కాగా కోమటిరెడ్డి దీక్ష గురువారం మూడో రోజుకు చేరుకుంది.
-
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు! -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే












Click it and Unblock the Notifications