సిబిఐ విచారణ: చంద్రబాబును ఇరికించిన వైయస్ జగన్

ఓబుళాపురం కేటాయింపులు దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరగలేదని బాబు హయాంలోనే జరిగాయన్నారు. ఈ ట్రాన్స్ఫర్ బాబు హయాంలో చట్టం రూపంలో చేసిందేనని ఈ కాపీ తాను అందరికీ ఇస్తున్నానని ఇప్పటికైనా ఆయన హయాంలోని అంశాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన మీడియాను కోరారు. ప్రధానంగా యెల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ మధ్యనే చేరిన టివి9 దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. వీరికి జర్నలిజం విలువలు ఉంటే ఇప్పటికైనా ఓఎంసిలోని అసలు విషయాన్ని బయటపెట్టారన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసును సిబిఐ అధికారులు ఏడాదిన్నరగా విచారిస్తున్నారని ఇన్ని రోజుల తర్వాత తనను పిలిచారంటే సాక్షిగానే పిలిచారన్నారు. సిబిఐకి తాను బాబు హయాంలోని జరిగిన కేటాయింపుల కాపీని ఇచ్చానన్నారు.
ఇటీవల హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని ఎలా విచారించారో తనను అలాగే విచారించారన్నారు. ఈ కేసులో ఓఎంసికి భూములు కేటాయించిన బాబును ఎందుకు ప్రశ్నించలేదని తాను సిబిఐని అడిగానన్నారు. అలాగే బాబును కూడా విచారించాలని అభ్యర్థించానని చెప్పారు. తనను అనవసరంగా ఈ కేసులో ఎందుకు ఇరికించారని కూడా వారిని అడిగానన్నారు. కాగా సిబిఐ అధికారులు జగన్ను సుమారు రెండున్నర గంటల పాటు విచారించారు.












Click it and Unblock the Notifications