మనిషి అనేవాడు వైయస్ జగన్‌లా ఉండడు: చంద్రబాబు

Chandrababu Naidu
హైదరాబాద్: సిబిఐ ప్రశ్నించిన అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ తనపై చేసిన ఆరోపణలపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి మండిపడ్డారు. వైయస్ జగన్మోహన్ రెడ్డిని పెద్ద క్రిమినల్‌గా ఆయన వ్యాఖ్యానించారు. వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్‌తో ఉన్న రామలింగరాజు, గాలి జనార్దన్ రెడ్డి, కోనేరు ప్రసాద్ జైలు పాలయ్యారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనకు బినామీ ఆస్తులున్నట్లు నిరూపిస్తే తన ఆస్తిని కూడా రాసిస్తానని ఆయన అన్నారు. జగన్, గాలి జనార్దన్ రెడ్డిలకు మాదిరిగా తనకు బంగారం కుర్చీలు, కమోడ్‌లు, ప్యాలెస్‌లు లేవని, తనకు మూడు గదుల ఇల్లు మాత్రమే ఉందని ఆయన అన్నారు. వైయస్ జగన్ కంపెనీలో ఆర్ఆర్ గ్లోబల్, రెడ్ గోల్డ్ సంస్థలు 70 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాయని ఆయన చెప్పారు. సిబిఐ ప్రశ్నిస్తే తాము మైనింగ్ మాఫియా లఘుపుస్తకంలో ఇచ్చిన జీవో కాపీని చూపించారని ఆయన అన్నారు. జగన్ సిబిఐ వద్దకు వెళ్లింది తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం చెప్పడానికా, తనపై ఫిర్యాదు చేయడానికా అని ఆయన అడిగారు. మనిషి అనే వాడు జగన్‌లా ఉండబోడని ఆయన అన్నారు.

వైయస్ ప్రభుత్వ హయాంలో లాలూచీ పడ్డారని, అవినీతికి పాల్పడ్డారని, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని ఆయన అన్నారు. తన ప్రభుత్వ హయాంలో అక్రమాలకు పాల్పడలేదని, అందుకే ఏమీ చేయలేదని అందరికీ బాధగా ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ వ్యవహారంలో ఏ విధమైన తప్పు జరగలేదని ఆయన అన్నారు. అంతా వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన అన్నారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ విషయంలో ఒప్పందం తమ హయాంలో జరిగినా దాన్ని తిరగదోడి అక్రమాలకు వీలు కల్పించి అవినీతికి పాల్పడింది వైయస్ హయాంలోనే అని ఆయన అన్నారు. స్థలం కేటాయింపు, విల్లాల విక్రయం, మినహాయింపులు, ఎపిఐఐసి వాటా తగ్గింపు వంటివన్నీ వైయస్ హయాంలోనే జరిగాయని ఆయన ఆన్నారు. ఎమ్మార్ -ఎంజిఎఫ్ కంపెనీని స్థాపించి, ఎపిఐఐసి వాటా తగ్గించింది కూడా వైయస్ హయాంలోనే అని ఆయన అన్నారు. రహేజా విషయంలోనూ వైయస్ ప్రభుత్వం అదే రీతిలో వ్యవహరించిందని ఆయన అన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన రచ్చబండ రచ్చరచ్చగా మారిందని ఆయన అన్నారు. కరవు ప్రాంతాలను ప్రకటించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించాలని తాను అంటే పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎదురుదాడికి దిగుతున్నారని ఆయన అన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడం చేత కాకపోతే చేత కాదని చెప్పాలని ఆయన అన్నారు. పెట్రో ఉత్పత్తుల ధరలను కేంద్ర ప్రభుత్వం 24 సార్లు పెంచిందని, దాని వల్ల నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+