పార్లమెంటు ఎదుట సత్యాగ్రహం: కొండా లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ రాష్ట్ర సాధనలో నిరాశ చెంది ఆత్మహత్యలు చేసుకునే వైఖరిని దూరం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒకే జెండా, ఒకే అజెండాతో తెలంగాణ కోసం ఉద్యమించే వారంతా ఒకే గొడుగు కిందకు రావాలన్నారు. అలాంటి కార్యకర్తలే ప్రస్తుతం ఉద్యమానికి అవసరమన్నారు. తెలంగాణ వచ్చే వరకు వివిధ రూపాల్లో ఉద్యమం కొనసాగిస్తానని చెప్పారు. రాజకీయ పార్టీలో తమతో కలిసి రాకపోవడం విచారకరమన్నారు. ధైర్యంతో గుండెబలంతో హింసాత్మక వైఖరి లేకుండా శాంతియుతంగా లక్ష్యాన్ని సాధించాలన్నారు. తెలంగాణ సాధిస్తాం, అనుభవిస్తాం అన్న నినాదంతో ముందుకు సాగాలని చెప్పారు.












Click it and Unblock the Notifications