మరింత మంది ఐఎఎస్లను విచారించనున్న సిబిఐ

మూడు కేసుల్లోనూ నిబంధనల ఉల్లంఘన కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఈ మూడు కేసులకు కూడా పరస్పర సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. వైయస్ హయాంలోని పెద్దల ప్రాపకంతో అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించారని అంటున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కేసులో శ్రీలక్ష్మిని తొలుత సాక్షిగా విచారించి, ఆ తర్వాత ముద్దాయిగా చేర్చారు. బిపి ఆచార్యను, శ్రీలక్ష్మిని కూడా సిబిఐ అరెస్టు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైయస్ జగన్ ఆస్తుల కేసులో మరింత మంది ఐఎఎస్ల జాబితా సిబిఐ వద్ద ఉన్నట్లు చెబుతున్నారు. నిమ్మగడ్డ ప్రసాద్కు చెందిన వాన్పిక్కు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి వల్లనే మినహాయింపులు ఇచ్చారా, మరే కారణంగానైనా ఇచ్చారా అనే విషయాన్ని తేల్చడానికి సిబిఐ మరికొంత మంది అధికారులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications