ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు: వైయస్ జగన్ జోస్యం

YSR Congress president YS Jagan
హైదరాబాద్: ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్, రంగా రెడ్డి జిల్లాలో పార్టీ నాయకులతో ఆయన మంగళవారం సమీక్ష జరిపారు. ఎన్నికలు ఎప్పుడై రావచ్చునని, వాటిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నాయకులకు సూచించారు. ఎన్నికల లోపే పార్టీని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ నెల 30లోగా పార్టీ కమిటీల నిర్మాణం పూర్తి కావాలని, డిసెంబర్ 30వ తేదీలోగా పార్టీ సభ్యత్వాలు పూర్తి చేయాలని ఆయన పార్టీ నాయకులను ఆదేశించారు. గుంటూరు జిల్లాలో తొలి విడత ఓదార్పు యాత్రను పూర్తి చేసిన జగన్ ఇటీవలే హైదరాబాద్ వచ్చారు.

తమ పార్టీ అంటేనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తమ పార్టీ గెలుస్తుందని, ఈ విషయం చంద్రబాబుకు తెలుసునని, ఆ భయమే చంద్రబాబును వెంటాడుతోందని ఆయన అన్నారు. చంద్రబాబు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒకే మాట మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే బాధ్యతను నెరవేర్చడం లేదని ఆయన విమర్శించారు. ప్రజలు ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయారని ఆయన అన్నారు.

చంద్రబాబు రైతు వేషం చూసి ప్రజలు పగటి వేషగాడిని గుర్తు తెచ్చుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. రెండున్నర ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో ఎవరికైనా ఓటు వేయవచ్చునని చెప్పడం ద్వారా చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని బతికించదలుచుకున్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. దాదాపు వంద మంది శాసనసభ్యులు రాజీనామా చేస్తే రెండున్నరేళ్లు ప్రభుత్వం ఉంటుందని ఎలా చెబుతున్నారని ఆయన అడిగారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+