వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గుజరాత్ అల్లర్ల కేసులో 31 మంది దోషులు

By Pratap
|
Google Oneindia TeluguNews

Gujarat
అహ్మదాబాద్: గుజరాత్‌లోని సర్దార్‌పురా అల్లర్ల కేసులో ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 73 మంది నిందితుల్లో 42 మందికి నిర్దోషులుగా విముక్తి కలిగించింది. మిగతా 31 మందిని దోషులుగా నిర్ధారించింది. గోద్రా రైలు దగ్ధం సంఘటన తర్వాత జరిగిన మత ఘర్షణల్లో 33 మందిని సర్దార్‌పురాలో సజీవ దహనం చేశారు. విముక్తి పొందిన 42 మందిలో 11 మంది దోషులు కారని, స్వేచ్ఛగా సంచరించడానికి మిగతావారు వ్యక్తిగత బాండ్లు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. మొత్తం 73 మందిపై హత్య, లూటీ, అల్లర్లు,త మతపరమైన కుట్ర వంటి పలు కేసులు బనాయించారు.

సర్దార్‌పురా అల్లర్ల కేసు దర్యాప్తును సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం (సిట్) చేపట్టింది. ఈ కేసులోనే బుధవారం తీర్పు వెలువడింది. పలువురు శరణు పొందిన సర్దార్‌పురా గ్రామంలోని ఇబ్రాహిం షేక్ అనే వ్యక్తి ఇంటికి 2002 ఫిబ్రవరి 28వ తేదీన అల్లరి మూకలు నిప్పు పెట్టాయి. ఈ ఘటనలో మొత్తం 33 మంది మరణించారు. మృతుల్లో 20 మంది మహిళలు ఉన్నారు. ఈ కేసులో 76 మంది నిందితులను అరెస్టు చేశారు. ట్రయల్ పెండింగులో ఉన్న సమయంలో ఇద్దరు మరణించారు. ఒక్కరిపై జువైనైల్ కోర్టులో విచారణ జరుగుతోంది. మొత్తం 73 మందిపై అభియోగాలు మోపి 2009 జూన్‌లో విచారణ చేపట్టారు.

English summary
The special fast-track court, Wednesday, acquitted 42 of the 73 persons accused in the 2002 Sardarpura riots case, where 33 persons were burnt to death during the communal violence that broke out after Godhra train burning incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X