తెలంగాణపై కీలక ప్రకటన: ఢిల్లీకి బొత్స సత్యనారాయణ

Botsa Satyanarayana
హైదరాబాద్: తెలంగాణపై ఒకటి రెండు రోజుల్లో కేంద్ర హోం శాఖ ప్రకటన వెలువరిస్తుందని భావిస్తున్న నేపథ్యంలో ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ బుధవారం ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. తెలంగాణపై చేసే ప్రకటనపై కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ మంగళవారం సాయంత్రం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడారు. తెలంగాణపై చేయాల్సిన ప్రకటన, ఆ ప్రకటన చేసే తేదీ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గులాం నబీ ఆజాద్ మంగళవారంనాడే బొత్స సత్యనారాయణతో ఫోనులో మాట్లాడారు. ఢిల్లీకి రావాల్సిందిగా ఆయన బొత్స సత్యనారాయణకు సూచించినట్లు తెలుస్తోంది. దీంతోనే బొత్స సత్యనారాయణ ఢిల్లీకి బయలుదేరి వెళ్లినట్లు చెబుతున్నారు.

తెలంగాణపై ప్రకటన చేయడానికి ముందు బొత్సతో పార్టీ అధిష్టానం చర్చలు జరపాలని అనుకున్నట్లు చెబుతున్నారు. రాష్ట్రంలోని తాజా పరిస్థితిపై, ప్రకటన చేసిన తర్వాత సంభవించబోయే పరిణామాలపై పార్టీ అధిష్టానం పెద్దలు బొత్స అభిప్రాయాన్ని తీసుకోనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించని సీమాంధ్ర నాయకుడిగా బొత్స సత్యనారాయణ చెప్పే అభిప్రాయాలు తటస్థంగా, వాస్తవానికి దగ్గరగా ఉంటాయని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆమరణ నిరాహారదీక్షను విరమింపజేయడానికి అనుసరించాల్సిన వైఖరిని కూడా అధిష్టానం పెద్దలు బొత్స సత్యనారాయణతో మాట్లాడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+