తెలంగాణ వస్తుందని తేలింది: టి- కాంగ్రెసు ఎంపీలు

రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామన్నారు. ఆజాద్ తాజా ప్రకటన రాష్ట్రం ఏర్పాటుపై నమ్మకం కలిగిస్తోందని, మీడియా వార్తలతో తమకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం పదవులు వదులుకునేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. ఆజాద్ ప్రకటన చేస్తామన్నారు కాబట్టే తాము ఆయనతో దీక్షను విరమింప చేశామన్నారు. కోమటిరెడ్డిని తెలంగాణ నేతలెవరూ పరామర్శించడానికి రాకపోవడాన్ని కోదండరాం ఖండించారు. అర్హత లేని వారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారన్నారు. జెఏసి సమావేశం ఏర్పాటు చేసి త్వరలో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. రాష్ట్రం వచ్చే వరకు ఉద్యమిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఒకరిద్దరు మినహా మంత్రులు కోమటిరెడ్డిని పరామర్శించక పోవడం ఏమిటన్నారు. తెలంగాణ కోసం దీక్ష చేయడమే తప్పా అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications