చెన్నైలో పద్మనాభ స్వామి తరహా రహస్య సంపద

చెన్నైలోని ఆ ఆలయం దాదాపు 1200 ఏళ్లనాటిది. ఇది న్యూ గుమ్మిడిపూడికి సమీపంలో ఉంది. ప్రాచీన కాలంనాటి నుంచి నేలమాళిగల్లో దాచిన సంపద చంద్రశేఖర స్వామి ఆలంయలో ఉన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఇది భక్తుల్లోనూ, ఆలయ అధికారుల్లోనూ ఆసక్తిని రేపింది. దీంతో హిందూ మత, చారిటబుల్ దేవాదాయ శాఖ అధికారులు ఆరడుగుల వెడల్పు, 15 అడుగుల పొడవు గల సొరంగాన్ని తెరవాలని నిర్ణయించారు. దీన్ని ఈ నెల 16వ తేదీన తెరిచే అవకాశం ఉంది.
చంద్రశేఖర స్వామి ఆలయం చోళ, పాండ్య పాలకుల శిల్పా కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. డిసెంబర్ 1వ తేదీన జరిగే కుంభాభిషేకం కోసం ఆలయం మరమ్మత్తులు చేపట్టినప్పుడు కోశాగారానికి సంబంధించిన అనుమానాలు తలెత్తాయని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పద్మనాభన్ చెప్పారు.












Click it and Unblock the Notifications