తెలంగాణ సస్పెన్స్కు తెర, సెషన్స్కు ముందే ప్రకటన?

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ స్వదేశానికి శనివారం తిరిగి రానున్నారు. ఆయన రాగానే తెలంగాణపై కదలికలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయట. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కేంద్రమంత్రి ప్రణబ్ ముఖర్జీతో గురువారం భేటీ అయ్యారు. తెలంగాణ అంశంపై వారి చర్చలు కేంద్రీకృతమైనప్పటికీ ఏ దిశగా నిర్ణయం తీసుకుంటారనే విషయంపై బొత్సకు చెప్పలేదని తెలుస్తోంది. అయితే ఆజాద్తో శుక్రవారం భేటీ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. రెండో ఎస్సార్సీ వేస్తామని తాము చెప్పింది యుపిని దృష్టిలో పెట్టుకొని కానీ తెలంగాణపై కాదు అని ఏఐసిసి అధికార ప్రతినిధి రషీద్ అల్వీ కాంగ్రెసు సీనియర్ నేత కె కేశవరావుతో స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
మరోవైపు ప్రణబ్ను కలిసే ముందు కెకె బొత్సతో మంతనాలు జరిపారు. శ్రీకృష్ణ కమిటీ సూచించి మూడు ప్రతిపాదనల పట్ల కోర్ కమిటీ దృష్టి సారిస్తున్నప్పటికీ అదే కమిటీ సూచించిన ప్రాంతీయ మండలి పట్ల మాత్రం విముఖతతో ఉన్నట్లుగా సమాచారం. ప్రాంతీయ మండలి వల్ల కాంగ్రెసుకు రాజకీయంగా మరింత నష్టం కలుగుతుందని వారు భావిస్తున్నారని సమాచారం.












Click it and Unblock the Notifications