జగన్ కేసు: డెలాయిట్కు విజయసాయి రెడ్డి సవాల్

సుదర్శన్ సమక్షంలో అతని వాదన తప్పని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ఎల్లో మీడియా ప్రచారాన్ని తిప్పికొట్టడానికి సిబిఐకి రాసిన లేఖను బహిరంగపరిచినట్లు ఆయన తెలిపారు. మెజిస్ట్రేట్ ముందు ఇచ్చినట్లు చెబుతున్న సుదర్శన్ వాంగ్మూలాన్ని తనకు ఇవ్వకుండానే తమను వ్యతిరేకించేవారికి ఎలా చేరిందని ఆయన అడిగారు. ఇదే డెలాయిట్ సుదర్శన్ 1800 కోట్ల రూపాయన నష్టాల్లో ఉన్న ఈనాడును విలువ కట్టిందని ఆయన చెప్పారు.
డెలాయిట్ నివేదికకు, సాక్షిలో పెట్టుబడుల రాకకు ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. సాక్షిలోకి పెట్టుబడులు ఆగస్టు 2007 నుంచే వచ్చాయని, డెలాయిట్ నివేదిక నవంబర్లో వచ్చిందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications