బాబు ఆస్తులపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం

చంద్రబాబు ఇటీవల ప్రకటించిన ఆస్తులు తప్పుల తడక అని విజయమ్మ తన పిటిషన్లో ఆరోపించారు. అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో చంద్రబాబు విపరీతంగా ఆస్తులు కూడబెట్టారని, అందుకు అక్రమాలకు పాల్పడ్డారని ఆమె అన్నారు. హైకోర్టు ఆదేశాలపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విచారణకు తాము భయపడేది లేదని తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రంనాయుడు అన్నారు. గతంలో వైయస్ ప్రభుత్వం వేసిన విచారణలు ఏవీ చంద్రబాబుపై ఆరోపణలను నిరూపించలేకపోయాయని ఆయన అన్నారు. వైయస్ జగన్పై జరుగుతున్న విచారణను తప్పుదోవ పట్టించడానికి వైయస్ విజయమ్మ చంద్రబాబుపై ఆ పిటిషన్ వేశారని ఆయన అన్నారు. వైయస్ కోర్టులో పిటిషన్ వేసి ఉపసంహరించుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications