వెళ్లిపోయే ఎమ్మెల్యేలతో జగన్‌కు నష్టం లేదు: మేకపాటి

Mekapati Rajamohan Reddy
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వైపు వచ్చిన శాసనసభ్యులు తిరిగి వెనక్కి వెళ్తే నష్టమేమీ లేదని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. జగన్ వెంట ఉన్న శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసులోకి వెళ్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో జగన్ వర్గానికి చెందిన రాజమోహన్ రెడ్డి బుధవారం మీడియా ప్రతినిధులతో ఆ విధంగా అన్నారు. జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులు వెనక్కి వెళ్లినా ఫరవా లేదని ఆయన అన్నారు. సిబిఐ ఎఫ్ఐఆర్‌లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకే తాను రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు.

తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని, అయితే స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని ఆయన అన్నారు. తన రాజీనామా కోసం బంద్‌లు, ఆందోళనలను చేయబోనని ఆయన అన్నారు. రాజీనామా సమర్పించిన తాను పార్లమెంటుకు వెళ్లలేదని ఆయన చెప్పారు. పదవుల కోసం చాలా మంది కాంగ్రెసు పార్టీలో ఉన్నారని ఆయన అన్నారు. హైకోర్టు చెప్పకపోయినా ఎఫ్ఐఆర్‌లో వైయస్సార్ పేరును సిబిఐ నమోదు చేయడం బాధ కలిగించిందని ఆయన అన్నారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి రాజీనామాను స్పీకర్ మీరా కుమార్ పెండింగులో పెట్టి ఢిల్లీకి రావాలని ఆయనను ఆహ్వానించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+