గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కోర్టు కెక్కడం మామూలైపోయింది: డిజిపి దినేష్ రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DGP Dinesh Reddy
గుంటూరు: డిజిపి నియామకాలపై కోర్టులకెక్కడం మామూలైపోయిందని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డిజిపి) దినేష్ రెడ్డి గురువారం గుంటూరు జిల్లాలో అన్నారు. దినేష్ రెడ్డి గురువారం మంగళగిరిలోని ఎపిఎస్‌పి రేంజ్‌ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసు ఉద్యోగాల కోసం ఎవరూ కూడా దళారులను ఆశ్రయించవద్దని విజ్ఞప్తి చేశారు. దళారులను ఆశ్రయించి తర్వాత మోసపోవద్దన్నారు. నియామకాలన్నీ పారదర్శకంగా జరిగాయని పైరవీలకు తావు లేదన్నారు.

పోలీసులకు కుల, మత, ప్రాంతీయ విభేదాలు ఉండవని చెప్పారు. పోలీసుల పని తీరును ఎవరూ శంకించాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ విషయంలో పోలీసులు జాతీయ విభేదాలకు తావులేకుండా పని చేస్తారన్నారు. మద్దెలచెర్వు సూరి హత్య కేసులో ప్రధాన నిందితుడు భానుకిరణ్‌ను పట్టుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

English summary
DGP Dinesh Reddy blamed for going court on DGP post. He confirmed that they will catch Bhanu Kiran soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X