స్పీకర్ను కలిసిన వైయస్ జగన్ వర్గం ఎమ్మెల్యేలు

సిబిఐ ఎఫ్ఐఆర్లో వైయస్ రాజశేఖర రెడ్డి పేరు చేర్చినందుకు నిరసనగా రాజీనామాలు చేసిన వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు ఈ ముగ్గురు ఉన్నారు. కాంగ్రెసు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా వారు రాజీనామాలు చేశారు. అయితే, జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యుల్లో కొంత మంది శాసనసభ్యులు తిరిగి కాంగ్రెసు వైపు రావడానికి మొగ్గు చూపుతున్నారని, కాంగ్రెసు నాయకులతో చర్చలు జరుపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ తమ రాజీనామాలను అంగీకరిస్తారనే భయం కొద్ది కాస్తా సమయం ఇవ్వాలని కోరడానికో, రాజీనామాలను ఆమోదించవద్దని చెప్పడానికో వారు స్పీకర్ను కలిశారనే పుకార్లు ప్రచారంలోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications