వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోమవారంలోగా చంద్రబాబుపై కేసు: లక్ష్మినారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Laxmi Narayana
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై సోమవారంలోగా కేసు నమోదు చేస్తామని సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మినారాయణ చెప్పారు. హైకోర్టు ఉత్తర్వులు అందకపోవడం వల్లనే చంద్రబాబుపై కేసు నమోదులో జాప్యం జరిగిందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఆయన ఉన్నతాధికారులతో కలిసి సిబిఐ డైరెక్టర్ అమర్ ప్రతాప్ సింగ్‌ను కలిశారు. అమర్ ప్రతాప్ సింగ్ సిబిఐ విచారిస్తున్న కేసుల పురోగతిని సమీక్షించారు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో పురోగతిని లక్ష్మినారాయణ సింగ్‌కు వివరించారు.

చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలని హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల కాపీని లక్ష్మినారాయణ సింగ్‌కు అందించారు. ప్రస్తుతం విచారిస్తున్న కేసులను దృష్టిలో పెట్టుకుని సిబ్బంది కొరతపై సింగ్, లక్ష్మినారాయణ మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. కేసులు పెరగడంతో సిబ్బంది కొరత ఏర్పడిందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆస్తులపై విచారణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసే ఆలోచన సాగుతున్నట్లు సమాచారం.

English summary
CBI JD Laxmi Narayana said that case will be booked against TDP president N Chandrababu Naidu before Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X