వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాలి లీజులకు శ్రీలక్ష్మే ఒత్తిడి చేశారు: రాజగోపాల్

By Pratap
|
Google Oneindia TeluguNews

Rajagopal
హైదరాబాద్: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి గనుల అక్రమ తవ్వకాల కేసులో గనుల శాఖ మాజీ డైరెక్టర్ రాజగోపాల్ సిబిఐ వద్ద ప్లేటు ఫిరాయించారు. తమ కస్టడీలో ఉన్న రాజగోపాల్‌ను సిబిఐ అధికారులు శుక్రవారం నాలుగో రోజు విచారించారు. అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి శ్రీలక్ష్మి ఒత్తిడి వల్లనే గాలి జనార్దన్ రెడ్డి ఫైళ్లను క్లియర్ చేయాల్సి వచ్చిందని ఆయన సిబిఐ అధికారులతో చెప్పినట్లు సమాచారం. తాను ఏ తప్పూ చేయలేదని ఆయన చెప్పుకున్నారు. కొంత మంది కుట్ర చేసి తనను ఇరికించారని ఆయన ఆరోపించారు. తాను శ్రీలక్ష్మి చెప్పినట్లు నడుచుకున్నానని ఆయన అన్నారు.

శ్రీలక్ష్మి 2007లో తనకు చాలా సార్లు ఫోన్ చేసి గాలి జనార్దన్ రెడ్డి ఫైళ్లను క్లియర్ చేయాలని ఒత్తిడి తెచ్చారని, తాను పంపిన ఇతర ఫైళ్లకు కొర్రీ పెట్టిందని ఆయన అన్నారు. తాను నిజాయితీగా పనిచేశానని, గనులను కాపాడానని, ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చేశానని, రాయల్టీ ద్వారా ప్రభుత్వానికి ఏటా 300 కోట్ల రూపాయలు వచ్చేలా చేశానని ఆయన వివరించారు. సిబిఐ అధికారులు గురువారం శ్రీలక్ష్మిని తొమ్మిది గంటల పాటు విచారించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే గాలి జనార్దన్ రెడ్డికి గనులు లీజుకు ఇచ్చినట్లు ఆమె చెప్పారు.

English summary
IAS officer Rajagopal has said that he worked under the pressure of Srilaxmi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X