వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు జయసుధ టాటా, కిరణ్ కుమార్‌పై ప్రశంసలు

By Pratap
|
Google Oneindia TeluguNews

Jayasudha
హైదరాబాద్: కాంగ్రెసు సికింద్రబాద్ శాసనసభ్యురాలు జయసుధ వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి దూరమైనట్లే. ఆమె ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. తనకు వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ జీవితం ఇచ్చినందున వైయస్ జగన్‌కు మద్దతిస్తానని ఇప్పటి వరకు చెప్పుకుంటూ వచ్చారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆమె మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. ఆమె శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డిని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి తన మద్దతు ఉంటుందని, ముఖ్యమంత్రి పనితీరు బాగుందని ఆమె మీడియా ప్రతినిధులతో అన్నారు. ముఖ్యమంత్రిని తన నియోజకవర్గానికి అహ్వానిస్తానని ఆమె చెప్పారు. రాజీవ్ యువకిరణాలు పథకం యువతకు వరమని ఆమె కొనియాడారు. వైయస్ జగన్‌కు మద్దతు ప్రకటిస్తూ వస్తున్న శాసనసభ్యుల్లో తొలి వికెట్ అధికారికంగా పడిపోయినట్లే. వైయస్సార్ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి సమర్థంగా అమలు చేస్తున్నారని ఆమె అన్నారు.

వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి శుక్రవారం ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా సమావేశమయ్యారు. తాము జగన్ వెంట ఉంటూనే ప్రభుత్వానికి మద్దతిస్తామని జగన్ వర్గానికి చెందిన శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చెప్పిన నేపథ్యంలో రాజకీయ పరిణామాలు మలుపు తిరుగుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా, జగన్ వెంట నడుస్తున్న శాసనసభ్యులు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారనే విషయం తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి.

English summary
It is clear that Secendurabad MLA Jayasudha has deserted YSR Congress president YS Jagan and joined hands with CM Kirankumar Reddy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X