గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కాంగ్రెసు కనుసన్నల్లోనే సిబిఐ పనిచేస్తోంది: జగన్

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
గుంటూరు: కాంగ్రెసు కనుసన్నల్లోనే సిబిఐ పనిచేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వ్యాఖ్యానించారు. తప్పు జరిగిందా, లేదా అని వెతకడం మానేసి వైయస్ రాజశేఖర రెడ్డిని ఇరికించేలా దర్యాప్తు జరుగుతోందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ఆయన గురువారం కాంగ్రెసుపై విమర్సలు చేశారు. సిబిఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే అర్థం పోయి కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌గా మారిందని, సిబిఐని అడ్డం పెట్టుకుని కాంగ్రెసు వైయస్ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు.

ప్రజలు వైయస్సార్ సువర్ణ యుగాన్ని తలుచుకోని రోజు లేదని ఆయన అన్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధర వచ్చేంత వరకు, రైతుల కన్నీళ్లు తీరేంతవరకు వైయస్ గుర్తుకు వస్తూనే ఉంటారని ఆయన అన్నారు. పేదలకు వైద్యం చేయించలేని అధ్వాన్న స్థితిలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. 108 సర్వీసులు పనిచేయడం లేదని ఆయన అన్నారు వృద్ధుల పింఛన్లలో కోత విధించాలనే ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. దేనిలో కోత పెడదామా అనే ప్రభుత్వం ఆలోచిస్తోందని ఆయన అన్నారు.

English summary
YSR Congress president YS Jagan terms CBI as Congress bureau of investigation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X