హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కరీంనగర్ జిల్లాకు చెందిన టెక్కీ అనుమానాస్పద మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: జిమ్నాజియంలో వర్క్ అవుట్ తర్వాత 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పద స్థితిలో మరణించాడు. హైదరాబాదులోని జూబ్లీహిల్స్‌లో మంగళవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లాకు చెందిన బి రాజు అనే ఆ టెక్కీ హైదరాబాదులోని ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రాజు ఉదయం ఏడున్నర గంటలకు జిమ్నాజియం వెళ్లాడని, అక్కడ వర్కవుట్ చేసి ఓ గంట తర్వాత తన ఫ్లాట్‌కు తిరిగి వచ్చాడని పోలీసులు చెబుతున్నారు. తీవ్రంగా బ్యాక్ పెయిన్ వస్తోందని చెప్పడంతో రాజుకు రూమ్ మేట్ పెయిన్ కిల్లర్ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

మాత్ర వేసుకున్న తర్వాత రాజు వాంతులు చేసుకోవడం ప్రారంభించాడని, ఆ తర్వాత స్పృహ తప్పి పడిపోయాడని, వెంటనే రూమ్ మేట్ అతన్ని సమీపంలోని ఆస్పత్రికి తీసుకుని వెళ్లాడని, అప్పటికే రాజు మరణించినట్లు వైద్యులు తెలిపారని పోలీసులు వివరించారు.

English summary
After a work out at a gymnasium, a 26-year-old software engineer died under mysterious circumstances in Jubilee Hills on Tuesday. The victim, B Raju, of Karimnagar was working as a software engineer in a private firm.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X